హైదరాబాద్ : వర్సిటీలోని వివిధ అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల నియామకాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం బుధవారం ప్రకటించింది. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణను రిజిస్ట్రార్గా నియమించారు. జంతుశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ బి. రెడ్యానాయక్ను వైస్ చాన్సలర్ ఓఎస్డీగా, కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కె శ్యామలను అకాడెమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్గా, ఎకనామిక్స్ విభాగానికి చెందిన డాక్టర్ ఎం. రాములుకు అకాడెమిక్ ఆడిట్ సెల్ జాయింట్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు.
అదేవిధంగా సోషియాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సి గణేష్ను యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ ప్రిన్సిపాల్గా, ఎకనామిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ బి సుధాకర్ రెడ్డి సికింద్రాబాద్లోని పీజీ కాలేజీ ప్రిన్సిపాల్గా, ప్రొఫెసర్ బి. నారాయణ నిజాం కాలేజీ ప్రిన్సిపాల్గా నియమితులయ్యారు.