హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): కొవిడ్ బారినపడుతున్నవారిలో 40శాతం యువతే ఉండటం ఆందోళన కలిగిస్తున్నదని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. ప్రజాచైతన్యం, అవగాహనతోనే వైరస్వ్యాప్తికి అడ్డుకట్టవేయగలమని ఆమె అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాజ్భవన్ నుంచి వివిధ వర్సిటీల వైస్చాన్స్లర్లు, ఉన్నత విద్యాశాఖఅధికారులతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్ నివారణ, వ్యాక్సినేషన్ కోసం జాతీయసేవాపథకం(ఎన్ఎస్ఎస్), జూనియర్, యూత్ రెడ్క్రాస్ వలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని వైస్చాన్స్లర్లకు సూచించారు. వీడియోకాన్ఫరెన్స్లో వివిధ వర్సిటీల వీసీలు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.