ప్రతినిధిగా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ హెచ్)లో ప్రముఖ గ్లోబల్ ఇంజినీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, డిజిటల్ టెక్నాలజీ సొల్యూషన్స్ (సైయంట్) తన శాఖను ఏర్పాటుచేసింది. తమ ప్రతినిధిగా ఐఐటీ హెచ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ రాజ్యలక్ష్మిని ఆ కంపెనీ సోమవారం ప్రకటించింది. భవిష్యత్తు సమాచార రంగంలో విస్తృత పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను చేపట్టేందుకు విద్యార్థులకు, అధ్యాపకులకు ఐఐటీ హెచ్ సైయంట్ చైర్ మార్గదర్శకం చేయనున్నది.