రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదుగంటల వరకు..
కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
జిల్లాలో పకడ్బందీగా అమలు
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: డీసీపీ నారాయణరెడ్డి
యాదగిరిగుట్ట రూరల్, ఏప్రిల్ 20 : రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ తీవ్రతను తగ్గిం చే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 9 గంటల నుంచి ఉద యం 5గంటల వరకు కర్ఫ్యూను ప్రకటించింది. పట్టణాలతో పాటు ప్రతి మండల కేంద్రాలు, గ్రామాల్లో సైతం కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేసేందుకు రాచకొండ కమిషనరేట్ యాదాద్రి భువనగిరి జోన్ పోలీసులు సిద్ధమయ్యారు. నిబం ధనలు అతిక్రమించి బయట తిరిగితే వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్-2005 ప్రకారం కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా రాత్రి 8గంటల వరకే జి ల్లాలో బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లకు అనుమతిని ఇచ్చింది. జిల్లాలో ఏడు బార్లు, 67 వైన్స్లు ఉన్నాయి. చౌటు ప్పల్ 3, భువనగిరిలో 3, పోచంపల్లి 1 బార్లు ఉండగా జిల్లాలో ఆరు థియేటర్లు ఉన్నాయి. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు, పెట్రోల్ బంకులు, ఐటీ సేవలకు, అనుమతి ఇవ్వగా కోల్డ్ స్టోరే జ్, వేర్ హౌజింగ్, విద్యుత్ సర్వీసులు యాథాతధంగా జరు గనున్నాయి.
కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ..
యాదాద్రి: కరోనా మహమ్మారి ఉధృతి దృష్ట్యా రాష్ట్ర ప్రభు త్వం తీసుకున్న నైట్ కర్ఫ్యూ అమలు యాదగిరిగుట్ట పట్టణం లో ప్రశాంతంగా కొనసాగుతున్నది. మంగళవారం రాత్రి 9 గంటలకు యాదగిరిగుట్ట సీఐ జానకీరెడ్డి ఆధ్వర్యంలో దుకా ణాలు, వైన్ షాపులు, కటింగ్ షాపులను మూయించారు. ప ట్టణంలో ప్రతి వార్డులో తిరుగుతూ కర్ఫ్యూకు సహకరించాల ని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ సరైన మార్గమని అన్నారు. అత్య వసర పరిస్థితులు మినహా బయటకు రావొదన్నారు. ప్రభు త్వం ప్రకటించిన నైట్ కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రజలెవ్వరు బయటకు రావద్దని సూచించారు. ఈ కర్ఫ్యూ ఈ నెల 30వ తేదీవరకు అమల్లో ఉంటుందని చెప్పారు.
జిల్లాలో పటిష్టంగా అమలు
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కర్ఫ్యూను యా దాద్రి భువనగిరి జోన్ పోలీసులు పటిష్టంగా అమలు చేసేందు కు సిద్ధమయ్యారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటి స్తూ ప్రభుత్వం ప్రకటించిన కర్ఫ్యూకు ప్రతి ఒక్కరూ సహకరిం చాలని యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి సూ చించారు. జిల్లా కేంద్రమైన భువనగిరితో పాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాలలో ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. అన్ని మండల కేంద్రాల్లో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో పోలీసులు నిఘా పెంచనున్నారు. పెట్రోలింగ్ను మరింత ము మ్మరం చేయనున్నారు. కర్ఫ్యూ అమలులో ప్రజలు సహకరిం చాలని పోలీసులు కోరుతున్నారు.
నిబంధనలు పాటించాలి
ఆత్మకూరు(ఎం): కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం విధించిన రాత్రిపూట కర్ఫ్యూ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్సై ఎండీ.ఇద్రీస్ అలీ అన్నారు. మంగళవారం పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 30 వరకు రాత్రి 9గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వర కు కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. వ్యాపారులు తమ దుకాణాలు రాత్రి 8గంటల వరకు మూసివేయాలని, గ్రామ ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని సూచించారు.
ప్రజలు సహకరించాలి
వలిగొండ: కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి నుంచి అమలు చేస్తున్న రాత్రి కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని ఎస్సై రాఘవేందర్గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. రాత్రి 9 గంటల నుం చి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ మండల వ్యాప్తంగా కొ నసాగుతుందని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాత్రివేళల్లో ప్రజ లు ఎవరు బయట తిరుగొద్దని, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
గుండాల: కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాత్రిపూట కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని ఎస్ఐ తిరుపతిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాపారులు రాత్రి 8గంటల వరకే తమ త మ దుకాణాలను మూసివేయాలని, తెలిపారు. అత్యవసర సేవలు, నిత్యావసర సరుకులు, మెడిసిన్, నీటి సరఫరాకు మినహాయింపు ఉంటుందని ఆయన తెలిపారు.
ప్రజలు బయటకు రావొద్దు
బీబీనగర్: కొవిడ్19 రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు అత్యవసరమైతేనే తప్పా ఇంట్లో నుంచి బయట కు రావొద్దని పండుగలు, వేడుకలు ఎవరి ఇంట్లో వారే జరుపు కోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిసకతే చట్టపరమైన చర్య లు తీసుకుంటామని ఎస్ఐ రాఘవేందర్ గౌడ్తెలిపారు.