మహబూబ్నగర్ : రాజకీయాలు మాట్లాడుకోవడానికి ఇది సమయం కాదు. ప్రజల ప్రాణాలు కాపాడటం మన ముందున్న ఉన్న కర్తవ్యం. ప్రతిపక్షాలు కొవిడ్ కట్టడిలో కలిసి రావాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కరోనా పేషంట్స్లో ఆత్మ స్థైర్యం నింపడానికి సీఎం కేసీఆర్ దవాఖానల పర్యటన చేపట్టారు.
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం సీఎం కేసీఆర్ చేశారన్నారు. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కొవిడ్ రోగులకు ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి కొవిడ్ పేషంట్స్ ను పరామర్శించడంపై ప్రతి పక్షాలు విమర్శలు చేయడం దారుణమన్నారు. జాతీయ పార్టీ లు విమర్శలు చేయడం దురదృష్టకరమనన్నారు.
జాతీయ పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో కంటే కొవిడ్ కట్టడిలో తెలంగాణ ఎంతో ముందుందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యం మీద భరోసా కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
ప్రైవేట్ దవాఖానల్లో తక్కువ ధరకు వైద్యం అందేలా చర్యలు తీసుకున్నాం. స్కానింగ్ ధరలు రూ. లు 1999 నిర్ణయంచామని మంత్రి స్పష్టం చేశారు. దహన సంస్కారాలు చేయడం కష్టం అవుతుందని మా దృష్టికి వచ్చింది. కొంతమంది కరోనా మహమ్మారితో ప్రాణాలను కోల్పోయిన సంఘటనలో వారి కుటుంబ సభ్యులు భయంతో డెడ్ బాడీని దవాఖానలో వదిలేసి వెళ్లడం బాధాకరమన్నారు.
అలాంటి వారి కోసం మహబూబ్ నగర్ పట్టణంలో కరోనా మహమ్మారితో చనిపోయిన వారి అంత్యక్రియలను కేవలం రూ.5కే గ్యాస్ ఆధారిత ప్లాంట్ ద్వారా చేయనున్నామని ఆయన తెలిపారు. దహన సంస్కారాలను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రూ.5కే త్వరలోనే నిర్వహించబోతున్నామన్నామని మంత్రి తెలిపారు.
నెల రోజుల్లో రెండు ఎకరాల్లో గ్యాస్ ఆధారిత శ్మశానవాటికను ఏర్పాటు చేస్తాం. మున్సిపల్అ ధికారులకు సమాచారం అందిస్తే దహన సంస్కారాలు ఏర్పాట్లు చేస్తారన్నారు.
మున్సిపల్ అధికారులు, కమిషనర్, కౌన్సిలర్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, చైర్మన్ అందరూ సమన్వయం చేసుకుంటూ కొవిడ్ బాధితులకు సహాయం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
కరోనా వల్ల బాధపడుతున్న పేషెంట్స్ కు భోజనవసతి ఇబ్బంది ఉన్న వారికి శాంత, నారాయణ గౌడ్ ట్రస్ట్ ద్వారా నిర్వాహకులు శ్రీహిత భోజన ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. బాధితుల ఇంటికి భోజనాలను అందజేస్తున్నారని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : హత్యకు దారి తీసిన భూ తగాదా
ఇలాగైతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ను రద్దు చేస్తాం
నెక్కొండ పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది
యాదాద్రిలో ప్రారంభమైన నృసింహుడి జయంతి ఉత్సవాలు
సెప్టెంబర్లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు..?