సువేందు అధికారి
హల్దియా: టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి శుక్రవారం తన సిట్టింగ్ స్థానమైన నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన ఇక్కడ మమతతో పోటీ పడనున్నారు. ‘నేను నందిగ్రామ్ భూమి పుత్రుణ్ని. ప్రజలు నావెంటే ఉన్నారు. నేను తప్పక గెలుస్తాను’ అని సువేందు అధికారి విశ్వాసం వ్యక్తం చేశారు.