సూర్యాపేట అర్బన్, జూన్ 12 : రైతులు ఎప్పుడూ ఒకే రకం పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాఆనంద్ అన్నారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో పంటల సాగుపై జరుగుతున్న సర్వేలో భాగంగా శనివారం కమీషన్దారులు, రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటల మార్పిడి చేయాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలైన ఆయిల్ పామ్, కూరగాయలు, పండ్ల తోటలు, ఉద్యాన పంటలకు ప్రభుత్వం నుంచి అధిక సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. భూసారం ఆధారంగా పంటల మార్పిడి చేయడం వల్ల అధిక దిగుబడితోపాటు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని సూచించారు.
అనంతరం మార్కెటింగ్ శాఖ ఇంటెలిజెన్స్, ఎనాలసిస్ విభాగం ప్రతినిధి వెంకటేశ్ మాట్లాడుతూ రైతులు తమకు అనుకూలమైన పంటలు కాకుండా భూసారానికి అనుకూలమైనవి సాగు చేయాలన్నారు. అనంతరం మార్కెట్లో రైతుల అభిప్రాయాలను సేకరించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ మేనేజర్ సంతోష్కుమార్, మార్కెట్ కార్యదర్శి ఫసియొద్దీన్, వైస్ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ పుష్పలత, ఖాసీం, కమీషన్దారులు సత్యనారాయణ, విద్యాసాగర్, రామారావు, జానకీరాంరెడ్డి, పర్వతాలు పాల్గొన్నారు.