ముంబై: దేశవ్యాప్తంగా మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీంతో రాష్ట్రాలు టీకా పంపిణీ కోసం సన్నద్ధమవుతున్నాయి. తమ అవసరాలమేరకు వ్యాక్సిన్ కంపెనీలకు ఆర్డర్లు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా మహారాష్ట్రలో 18 ఏండ్లు నిండినవారు, పైబడినవారు మొత్తం ఐదు కోట్ల మందికి పైగా ఉన్నారని, వీరికోసం తమకు 12 కోట్ల వ్యాక్సిన్లు అవసరమవుతాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోప్ అన్నారు. తమ డిమాండ్కు సరిపడా కేటాయించాలని వ్యాక్సిన్ తయారీదారులైన సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీలకు లేఖ రాశామని చెప్పారు. ఒకవేల ఆ మొత్తంలో వ్యాక్సిన్ సరఫరా కాకపోతే మే 1 నుంచి టీకా ఎలా పంపిణీ చేయాలని కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈమేరకు రాష్ట్రానికి వ్యాక్సిన్లు కేటాయించాలని కోరారు.
దేశవ్యాప్తంగా నేటి నుంచి 18 ఏండ్లు పైబడినవారికి టీకా కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభకానుంది. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారు తమ పేర్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. అర్హులంతా తమ మొబైల్ నంబర్ ద్వారా కొవిన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా పేరు నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏండ్లు పైబడినవారి కరోనా టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభంకానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..