కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ నడుస్తుంది. మనదేశంలో ఈ వైరస్ ఉద్ధృతి మరింత వేగంగా ఉంది. ప్రతి రోజూ లక్షా పాతిక వేల కేసులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కరోనా కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఈ వైరస్ బారిన పడ్డారు. తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అల్లు అరవింద్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నివేదా థామస్ ఇలా చాలామంది రెండోదశ మొదలైన తర్వాత ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలో ఇప్పుడు హీరోయిన్ అంజలికి కరోనా వచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి.
దానిపై అంజలి కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో అంతా ఇది నిజమే అనుకున్నారు. పైగా వకీల్ సాబ్ సినిమాలో ఈమెతో పాటు కలిసి నటించిన నివేదా థామస్ కు ఈ మధ్య కరోనా వచ్చింది. దానికి తోడు ఇద్దరూ కలిసి ప్రమోషన్ కూడా చేశారు. దాంతో అంజలికి కరోనా సోకి ఉంటుందని అంతా అనుకున్నారు. ఈ వార్తలు ఇప్పుడు ఎక్కువైపోవడంతో తన సోషల్ మీడియా పేజీలో దీని గురించి కామెంట్ చేసింది అంజలి. ఈ విషయంపై ఒక లెటర్ విడుదల చేసింది.
‘అందరికీ నమస్కారాలు.. నాకు కోవిడ్ వచ్చింది అంటూ చాలా మీడియా మాధ్యమాలలో వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు. నాకు వైరస్ సోకలేదు’ అని చెప్పుకొచ్చింది. ఇదంతా తప్పుడు వార్తలు అని కొట్టేసింది అంజలి. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని ఇలాంటి వార్తలు నమ్మొద్దని అంటూ అభిమానులను కోరింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి