హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసులు ప్రారంభమైన నేపథ్యంలో నూతన ప్రవేశాలపై విద్యాశాఖ దృష్టి సారించింది. కొత్తగా స్కూళ్లలో చేరినవారి వివరాలను schooledu.telangana.gov.in పోర్టల్లో నమోదుచేస్తున్నది. ఈ పోర్టల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడి లాగిన్ ఐడీ ద్వారా విద్యార్థుల పేర్లను నమోదు చేసేందుకు అవకాశమిచ్చారు. 2021-22 విద్యాసంవత్సరానికి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రవేశాలకు వీలు కల్పిస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీచేశారు. పిల్లలు స్కూళ్లకు రానవసరం లేకుండా ఆధార్ నంబర్తో 12వ తరగతి వరకు విద్యార్థుల నమోదుకు అవకాశం కల్పించారు. రాష్ట్రంలో 26,065 ప్రభుత్వ పాఠశాలలున్నాయి.