సంగారెడ్డి : జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద భారీగా వస్తున్నది. శుక్రవారం 4,394 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగిందని ప్రాజెక్టు ఏఈ మజార్ మహ్మద్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.864 టీఎంసీలుగా ఉంది. 523.474 మీటర్ల నీరు ఉండగా, ఔట్ఫ్లో 386 క్యూసెక్కులు వెళ్తుందని తెలిపారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి 5.243 టీఎంసీల వరద వచ్చిందని ఏఈ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మత్తడి దుంకుతున్న లక్నవరం సరస్సు
ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవాహం
వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ