జోగులాంబ గద్వాల : ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్కు వరద ప్రవాహం పెరుగుతూ వస్తున్నది. ఇన్ఫ్లో 22,000 క్యూసెక్కులు, 16,893 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లోగా నమోదైంది. పవర్హౌస్కు 13,781 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1కు 650 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2కు 750 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 540క్యూసెక్కులు, కుడి కాలువకు 178క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 150క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 94క్యూసెక్కుల నీరు ఆవిరిగా నమోదైంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.928 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది.
ఇవి కూడా చదవండి..
విషాదం : సంప్లో పడి వ్యక్తి మృతి
హుజురాబాద్ ప్రజలు ప్రలోభాలకు లొంగరు
రైతువేదికలు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్దే
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చల్లా
సీఎం కేసీఆర్ విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన