నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 16,590 ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 1090.20 అడుగుల (85.910 టీఎంసీలు) నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి ఆవిరి, లీకేజీ రూపంలో 617 క్యూసెక్కులు పోతున్నదని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కాకతీయ కాలువకు 8 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది. మిషన్ భగీరథ తాగునీటి అవసరాల కోసం 152 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఈ సీజనులో ఎగువ ప్రాంతాల నుంచి మొత్తం 115.456 టీఎంసీల వరద వచ్చిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జులుం
ఛత్తీస్గఢ్ పోలీసులకు చిక్కిన టైగర్ హుంగా
పిల్లలతో కలిసి ఈత కొట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
Tokyo Olympics: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల నిషియా
గంభీర్కు చుక్కెదురు.. స్టే ఇవ్వలేమన్న సుప్రీం