జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద మూడు రోజుల నుంచి గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. పుష్కరఘాట్ను ఆనుకొని పారుతోంది. 12.08 మీటర్ల ఎత్తులో పారుతూ 9,17,090 క్యూసెక్కుల నీరుగా లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్ వైపు నీరు తరలుతోంది.
అదేవిధంగా అన్నారం(సరస్వతీ) బరాజ్కు 574910 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 62 గేట్లు ఎత్తి అంతేమొత్తాన్ని దిగువ గోదావరి నదిలోకి వదులుతున్నారు. బరాజ్లో ప్రస్తుతం 02.23 టీఎంసీత నీరు నీపల్వ ఉన్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.
అలాగే లక్ష్మీ బరాజ్కు 9,17,090 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 79 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని వదులుతున్నన్నారు. కాగా ప్రస్తుతం బరాజ్లో 7.456 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Nizamabad incident | అత్యాచార ఘటనలో ఆరుగురు నిందితుల అరెస్ట్
Crime news | భూ తగాదాలో తండ్రిని చంపిన తనయులు
Nizamabad | గోదావరికి కొనసాగుతున్న వరద ఉధృతి
పింక్ టెస్ట్లో అదరగొడుతున్న అమ్మాయిలు.. స్మృతి హాఫ్ సెంచరీ