ముంబై : టీ సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ హత్య కేసులో ఇవాళ ముంబై హై కోర్టు తుది తీర్పును వెలువరించనున్నది. ముంబైలోని జూహూలో ఉన్న ఓ ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో గుల్షన్ కుమార్ను హత్య చేశారు. 1997, ఆగస్టు 12వ తేదీన ఆ మర్డర్ జరిగింది. ఆ కేసులో అబ్దుల్ రౌఫ్ మర్చంట్ అనే వ్యక్తి దోషిగా తేలాడు. అతన్ని ముంబైలోని ఆర్ధర్ జైలులో ఉంచారు. కాంట్రాక్ట్ కిల్లర్ మర్చంట్కు 2002లో జీవితఖైదు శిక్షను వేశారు. ఔరాంగాబాద్ జైలులో ఉన్న సమయంలో మర్చంట్ తప్పించుకున్నాడు. బంగ్లాదేశ్కు పరారీ అయిన అతన్ని మళ్లీ పట్టుకున్నారు. ఈ కేసులో తాను నిర్దోషిని అంటూ మర్చంట్ కోర్టులో అప్పీల్ చ ఏసుకున్నాడు. అయితే ఇవాళ జస్టిస్ జాదవ్, జస్టిస్ బోర్కార్లతో కూడిన ధర్మాసనం ఆ అప్పీల్పై తీర్పు ఇవ్వనున్నది.