హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చొరవతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కరోనా బాధితుల కోసం వంద ప్రత్యేకబెడ్స్ ఏర్పాటవుతున్నాయి. ఎమ్మెల్సీ సూచన మేరకు సింజెంట కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధులతో వీటిని సమకూరుస్తున్నది. కల్వకుర్తి, జడ్చర్ల సీహెచ్సీలు, బాలానాగర్, కోయిలకొండ, మద్దూర్, కొల్లాపూర్, వీపగండ్ల పీహెచ్సీలు, అచ్చంపేట ఎంసీహెచ్లో వీటిని ఏర్పాటుచేయనున్నారు. ఇందుకు కృషిచేసిన ఎమ్మెల్సీ కవితకు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.