నర్సంపేట, జూన్ 20: ప్రభుత్వ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 46 మంది లబ్ధిదారులకు రూ. 14.70 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందించి మాట్లాడారు. ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేని ఎంతో మందికి ముఖ్యమంత్రి సహాయనిధి వరంగా మారిందన్నారు. ఇటీవల కరోనాతో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం పింఛన్ రూపంలో ఆర్థిక సాయం అందించే ప్రక్రియ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసినా కొవిడ్ జాగ్రత్తలను పాటించాలని కోరారు. రాబోయే థర్డ్ వేవ్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, ఎంపీపీ మోతె కళావతి పద్మనాభరెడ్డి, జడ్పీటీసీ కోమండ్ల జయమ్మ-గోపాల్రెడ్డి, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గంప రాజేశ్వర్గౌడ్ పాల్గొన్నారు.