గీసుగొండ/నెక్కొండ/వర్ధన్నపేట, మే 7: రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని గీసుగొండ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు అన్నారు. శుక్రవారం ఊకల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కుడా డైరెక్టర్ వీరగోని రాజ్కుమార్, సొసైటీ చైర్మన్ మండల వీరస్వామి, వైస్ చైర్మన్ చల్లా కృష్ణారెడ్డి, ఊకల్ ఎంపీటీసీ వీరరావు, సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము మండలకేంద్రం, పెద్దకోర్పోలు, నాగారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వైస్ ఎంపీపీ పుండరీకం, మార్కెట్ కార్యదరి శ్రీధర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వెంకన్న, పెద్దకోర్పోలు సర్పంచ్ మహబూబ్పాషా, పీఏసీఎస్ డైరెక్టర్లు రాంచందర్, గోపి, లక్ష్మీరాములు, ఉప సర్పంచ్ ఇంద్రసేనారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు అమ్జద్ పాల్గొన్నారు.
ధాన్యం బస్తాల తరలింపుపై సమీక్ష
వర్ధన్నపేట: కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను తరలించే విషయంపై ఇల్లంద వ్యవసాయ మార్కెట్ యార్డులో అధికారులు, ప్రజాప్రతినిధులు శుక్రవారం సమీక్షించారు. ధాన్యం నాణ్యతగా రావడం లేదని, వేబ్రిడ్జి తూకంలో తక్కువగా వస్తున్నందున ఒక్కో బస్తా 43 కిలోల తూకం వేస్తేనే దిగుమతి చేసుకుంటామని మిల్లు యజమానులు లారీలు, ట్రాక్టర్ల నుంచి దిగుమతి చేసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. దీనివల్ల రైతులు యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం పై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు చెబుతున్నారు. వర్ధన్నపేట, రాయపర్తి త హసీల్దార్లు సూర్యప్రకాశ్, సత్యనారాయణ, సీఐ విశ్వేశ్వర్, ఎస్సై వంశీకృష్ణ, ఏఎంసీ కార్యదర్శి వెంకట్రెడ్డి, సర్పంచ్ సాంబ య్య, ఎంపీటీసీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
సంగెం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ బీ విశ్వనారాయణ హెచ్చరించారు. కాపులకనపర్తి సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. గీసుగొండ మండలం గొర్రెకుంటలోని రెండు మిల్లుల యజమానులు ఇబ్బంది పెడుతున్నారని నిర్వాహకులు తహసీల్దార్కు విన్నవించగా, లిఖితపూర్వకంగా ఇవ్వాలన్నారు.