ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ)లపై భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కొరడా ఝుళిపించింది. నిబంధనలను పాటించనందుకు ఆ బ్యాంకులపై రూ.6 కోట్ల జరిమాన విధిస్తూ నిర్ణయం తీసుకున్నది.
ఈ బ్యాంకులు ఉల్లంఘించిన నిబంధనల్లో ‘ఫ్రాడ్ క్లాసిఫికేషన్ అండ్ రిపోర్టింగ్ రూల్’ నిబంధన ఒకటి. దీంతో బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రూ.4 కోట్లు, పీఎన్బీపై రూ.2 కోట్ల జరిమానను ఆర్బీఐ విధించింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా వాల్యూయేషన్పై 2019 మార్చి 31న తనిఖీ నిర్వహించినట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఒక ఖాతా విషయంలో ఫ్రాడ్ జరిగినట్లు తమ సమీక్షలో గుర్తించినట్లు ఫ్రాడ్ మానిటరింగ్ రిపోర్ట్ (ఎఫ్ఎంఆర్)లో పేర్కొంది.
ఫైనాన్సియల్ పొజిషన్పై పర్యవేక్షణలో పీఎన్బీ విఫలమైందని మరో ప్రకటనలో ఆర్బీఐ తెలిపింది. ఈ రెండు కేసుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ నిబంధనలు పాటించలేదని తేలిందని వెల్లడించింది. రెగ్యులేటరీ కంప్లియన్స్లో వైఫల్యానికి గానీ వీటిపై జరిమాన విధించినట్లు పేర్కొంది.
ఇంతకుముందు ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్పైనా ఆర్బీఐ పెనాల్టీ విధించింది. నిబంధనలను బ్రేక్ చేసిందని ఐసీఐసీఐ బ్యాంక్పై అభియోగం.. పెనాల్టీ విధించడానికి ముందు ఆర్బీఐ నోటీసు కూడా జారీ చేసింది.
షాకింగ్ :సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా ఊపందుకోని నియామకాలు!
E-Commerce బలోపేతమే లక్ష్యం: క్యూర్ఫిట్లో టాటా పెట్టుబడులు
ఇండియాలో లాంచ్ అయిన మరో ఖరీదైన కారు
భారత్లోనూ క్రిప్టో ఒక అసెట్: నందన్ నిలేకని సంచలనం!!
టాప్ గెయినర్స్ జాబితాలో… బ్రిటానియా,హెచ్ సీఎల్ టెక్..
వ్యాక్సిన్ తీసుకున్న వరుడు కావాలి.. ఇదీ శశీ థరూర్ పంచ్
నేనేమీ నవాజ్ షరీఫ్ను కలిసేందుకు వెళ్లలేదు..
అమరావతి ఎంపీ నవనీత్ కౌర్కు బాంబే హైకోర్టు షాక్
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
వృథా చేస్తే ఇచ్చే వ్యాక్సిన్లలో కోత.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో అగ్ని ప్రమాదం
వాట్సాప్ స్టేటస్.. రిపోర్టర్పై కేసు