నోయిడా : సీనియర్ జీఎస్టీ అధికారి భార్య విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యూపీలోని నోయిడాలో వెలుగుచూసింది. బాధితురాలిని 26 ఏండ్ల హినా సింఘ్లాగా గుర్తించారు.ఆమె భర్త అమిత్ సింఘ్లా ఢిల్లీలోని జీఎస్టీ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నారు. నోయిడాలోని సెక్టార్ 99లోని సుప్రీం టవర్స్ హౌసింగ్ సొసైటీలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
వరకట్న వేధింపులతోనే హినా బలవన్మరణానికి పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషం సేవించిన అనంతరం హినాను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలు సీఏగా పనిచేస్తూ పంజాబ్ యూనివర్సిటీ నుంచి లా అభ్యసిస్తోంది. పంజాబ్కు చెందిన హినా గత ఏడాది అమిత్ను వివాహం చేసుకుంది. భర్త, అతడి కుటుంబ సభ్యులు నిత్యం ఆమెను కట్నం కోసం వేధించేవారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా అమిత్తో పాటు ఆమె అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు