కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 25(నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండ లం మెస్రంగూడ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాం తంలో గిరిజనుల ఆధ్యాత్మిక స్థలంగా పేరొందిన అర్జున్లొద్ది గుహ ఆదిమానవుల కాలం నాటి సున్నపు రాతిగుహగా అటవీశాఖ అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. ఈ సున్నపు రాతి గుహ సహజసిద్ధంగా ఏర్పడినట్టు వారు గుర్తించారు. గోండు, పర్ధాన్ తెగలకు చెందిన గిరిజనులకు అర్జున్ పేన్ (అర్జునుడు)ను దైవంగా ఆరాధిస్త్తారు. గుహలో ఈ శిల ఉన్నందున ఈ ప్రాంతాన్ని అర్జున్లొద్ది అంటున్నారు. గిన్నేధరి రేంజ్ అధికారి ప్రణయ్ చొరవతో జిల్లా అటవీ అధికారి శాం తారాం ప్రోత్సాహంతో ఈ సున్నపు రాతి గుహ వెలుగులోకి వచ్చింది. ఆదివాసీలకు సుపరిచితమైన ఈ గుహ ఇప్పటివరకు శాస్త్రీయ పరిశోధనకు నోచుకోలే దు. ఈ ప్రాంతంలో పాత రాతి యుగపు మానవ సం చారానికి సంబంధించిన ఆనవాళ్లు, రాతి పరికరాలు కనిపిస్తాయి. పక్కనే జలధార ఉండటం వల్ల పాతరాతి యుగం మానవులు ఇక్కడ ఆవాసాలుగా చేసుకొని ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.