హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు పొడగించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. తన పదవీకాలాన్ని పొడగించిన సీఎం కేసీఆర్కు రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.