అశ్వారావుపేట : ఆయిల్పాం గెలల ధర పెరిగింది. టన్ను ఆయిల్ పాం గెలల ధర రూ.16,717 పెంచుతూ ఆయిల్ ఫెడ్ నిర్ణయించిందని ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ టి.సుధాకర్రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఆయిల్ ఫెడ్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైందన్నారు. గత నెలలో టన్ను రూ.16,415 ఉండగా ఆయిల్ రికవరీ, విక్రయాలను అంచనా వేసి ఈ నెల గెలల ధర మరో రూ.302 పెంచిందన్నారు. ఆగస్టు నెలలో గెలలను ఫ్యాక్టరీకి తరలించిన రైతులకు మాత్రమే ఈ ధర వర్తిస్తుందన్నారు.