హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): కరోనా రోగులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా రాష్ట్రప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. గత 24 గంటల్లో 318 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను ఒడిశా నుంచి తీసుకువచ్చినట్టు అధికారులు తెలిపారు. మరో 144 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తిలో ఉన్నట్టు వెల్లడించారు. ఆక్సిజన్ రవాణాను ప్రత్యేక ప్రధాన కార్యరర్శి సునీల్శర్మ, రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు ఇతర ముఖ్య అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 15 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న ఐదు ఖాళీ ట్యాంకర్లను సనత్నగర్ రైల్వేస్టేషన్ నుంచి ఒడిశాకు పంపుతున్నట్టు వివరించారు. 15 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న మరో రెండు ట్యాంకర్లను సైనిక రవాణా విమానాల ద్వారా పంపుతున్నామని వెల్లడించారు.