యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం ఓఎస్డీ భూపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ నెల 21 న సీఎం కేసీఆర్ యాదాద్రి పనులను పర్యవేక్షించనున్న నేపథ్యంలో అందుకనుగుణంగా కావాల్సిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పనులు పక్కాగా చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట కలెక్టర్ పమేలా సత్పతి, వైటీడీఏ, ఆలయ అధికారులు ఉన్నారు.