ధిక్కార కేసుల్లో శిక్ష పడిన అధికారులకు హైకోర్టు స్పష్టీకరణ
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): కోర్టు ధికార కేసుల్లో శిక్షలను సవాలు చేసిన అధికారులు అప్పీ ల్ పిటిషన్ల విచారణకు విధిగా హాజరుకావాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. అధికారులకు జైలుశిక్షతోపాటు జరిమానా విధించినట్లయితే ఆ మొత్తాన్ని హైకోర్టు రిజిస్ట్రీలో చెల్లించిన తర్వాతే అప్పీల్ దాఖలు చేయాలని స్పష్టంచేసింది. లేనిపక్షంలో హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు అమలుపై స్టే ఉత్తర్వులు పొడిగించబోమని, సదరు అధికారులు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనం ఇటీవల వేర్వేరు కేసుల్లో కీలక ఉత్తర్వులు జారీచేసింది. వివరాల్లోకెళ్తే.. భూసేకరణ చట్టానికి విరుద్ధంగా రోడ్డు విస్తరణకు భూసేకరణ చేసి బాధితులకు పరిహా రం చెల్లించలేదన్న కేసులో వరంగల్ రూరల్ జిల్లా ఆర్డీవో సీహెచ్ మహేందర్జీకి హైకోర్టు సింగిల్ జడ్జి జైలుశిక్షతోపాటు జరిమానా విధించారు. ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లో లెక్చరర్లుగా చేస్తున్న పీవీ రమణ సహా 118 మందికి కనీస టైం సేల్, ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్న ఉత్తర్వులను అమలుచేయలేదన్న కేసులో రాష్ట్ర రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి ఏ సత్యనారాయణరెడ్డికి.. సీఆర్పీసీలోని సెక్షన్-41ఏ కింద నోటీసు ఇవ్వకుండా ఓ నిందితుడిని అరెస్టు చేశాడన్న కేసులో హైదరాబాద్ ఎస్సార్ నగర్ ఎస్సై అశోక్ నాయక్కు కూడా జైలుశిక్ష, జరిమానా విధించడంతో వారంతా సింగిల్ జడ్జి తీర్పులను సవాలు చేశారు. దీంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం పై ఉత్తర్వులు జారీచేసింది.
ఆర్ఎంపీల వినతిని స్వీకరించండి
ఆర్ఎంపీలకు కమ్యూనిటీ పారామెడికల్ ట్రైనింగ్ నిర్వహించాలని కోరుతూ ఆర్ఎంపీ, పీఎంపీల అసోసియేషన్ ఇచ్చే వినతిపత్రాన్ని స్వీకరించి చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది. 2015లో ఇచ్చిన జీవో 428 ప్రకారం ప్రభుత్వం తమకు శిక్షణ ఇవ్వాలని గత నెల 5న వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేదని సంఘం దాఖలు చేయడంతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.