హైదరాబాద్, మే 23: కరోనా సమయంలో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం బలమైన ఆహారాన్ని తినాలి.పైగా, పెద్ద వాళ్ళు పాటించినన్ని జాగ్రత్తలు కూడా చిన్న పిల్లలు పాటించరు. కానీ వారి ఇమ్యూనిటీ పెరగాలంటే వారు సరిగ్గా ఆహారం తీసుకునేలా చేయడం తప్పని సరి. పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ ఫుడ్స్ వారికి తినిపించండి.
కోడిగుడ్డు పచ్చసొనలో ఐరన్, విటమిన్ ఎ, డి ఉంటాయి. ఎగ్వైట్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను అడ్డుకునేందుకు తోడ్పడతాయి. పాలకూర, మెంతి, బ్రకోలీ, మునగాకులు…వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఫోలిక్ ఆసిడ్, ఐరన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. వారంలో కనీసం మూడురోజులు వీటిని తీసుకుంటే ఇమ్యూనిటీకి ఢోకా ఉండదు.
స్వీట్కార్న్లో విటమిన్ బి12, ప్రొటీన్స్, ఫైబర్ అధికంగా లభిస్తాయి. సలాడ్, సూప్స్ రూపంలో ఇతర డిష్లతో కలిపి తీసుకున్నా ఇమ్యూనిటీ పెరుగుతుంది. విటమిన్ ‘ఎ’ అత్యధికంగా కందగడ్డలో లభిస్తుంది. అంతేకాకుండా ఫోలికాసిడ్, ఫైబర్ కూడా ఉంటాయి. వారంలో రెండు రోజులు తిన్నా చాలా ప్రయోజనం ఉంటుంది.
తులసిలో కాల్షియం, పొటాషియం, జింక్, యాంటీకేన్సర్ గుణాలుంటాయి. తులసిని గ్రీన్టీతో తీసుకోవచ్చు. సలాడ్స్తో కలిపి తీసుకోవచ్చు. వాల్ నట్స్, బాదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు వంటివి ఎక్కువగా తినాలి. వీటిలో ఉండే ప్రొటీన్స్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్ ఇమ్యూనిటీని పెంచుతాయి.