మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతున్నది. ఎగువన నారాయణపూర్ ప్రాజెక్టు గెట్లు ఎత్తివేయడంతో జూరాలకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులోకి 3.75 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. ఈ నేపథ్యంలో అధికారులు జలాశయం 41 గేట్లు ఎత్తి 3,76,027 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం జలాశయంలో 316.55 మీటర్ల నీటిమట్టం ఉన్నది. జూరాల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలుకాగా, 6.01 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.