హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగా ణ): బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమైన మందులను బ్లాక్లో విక్రయిస్తున్న మెడికల్ మాఫియా ముఠాను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్చేశారు. మెడికల్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిర్జాదిగూడకు చెందిన నర్మిల్ల యాద య్య, పిరమల్ ఫార్మసీ కంపెనీ ఉద్యోగి పెద్దోచ్ సతీశ్, బంజారాహిల్స్లోని స్నాజిన్ ఫార్మసీ ఉద్యోగి కాకిరాల సాయికుమార్, ఎం క్యూర్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున బుద్దారెడ్డి గారి రాజశేఖర్రెడ్డి కొవిడ్ చికిత్సకు ఉపయోగపడే మందులను బ్లాక్లో విక్రయిస్తున్నారు. రెమ్డెసివర్ మందులపై పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటంతో, బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ‘అంపోటెరిసిన్ బి లిపోజమ్’ ఇంజెక్షన్లను బ్లాక్లో విక్రయించాలని ప్లాన్ చేశారు. మార్కెట్లో ఈ ఇంజెక్షన్ రూ.7,858 వరకు అమ్ముతున్నారు. ఇప్పుడు ఈ మందుకు కూడా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో యాదయ్య ఐదు ఇంజెక్షన్లను సెలోన్ ల్యాబ్ నుంచి సంపాదించాడు. ఒక్కో ఇంజెక్షన్ను రూ.50 వేలకు అమ్మేందుకు ఫ్లాన్చేశాడు. నలుగురూ కలిసి కాచిగూడలో వీటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా, సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు వీరిని అరెస్టుచేశారు.