న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్కు గవర్నర్ శ్రీకారం
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొండ రెడ్లు, చెంచులు, ఇతర ఆదిమజాతి గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్ కార్యక్రమాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఉగాది సందర్భంగా రాజ్భవన్లో లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమం అమలుకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు గవర్నర్ రూ.8.6 లక్షల చెక్కు అందించారు. ఈ సందర్బంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), ఈఎస్ఐ కళాశాల వైద్యులు, రెడ్క్రాస్ ప్రతినిధులు, ట్రై ఫెడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆదిమ జాతి గిరిజనులకు పోషకాహారం అందించి, వారి జీవన విధానాన్ని మెరుగుపరచడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను ఖరారుచేయాలని అధికారులను తమిళిసై ఆదేశించారు.
రాజ్భవన్లో తెలుగు సంప్రదాయం ప్రకారం ఉగాది ఉత్సవాలు నిరాడంబరంగా జరిగాయి. గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ దంపతులు ఆహూతులకు స్వయంగా ఉగాది పచ్చడి అందించి, బెల్లంతో తయారుచేసిన వంటకాలను వడ్డించారు.