న్యూఢిల్లీ : దివంగత రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా సతీమణి, మాజీ ఎంపీ శాంతి పహాడియా ఆదివారం కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆమె చికిత్స పొందుతూ
గురుగ్రామ్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో తుది శ్వాస విడిచారు. జగన్నాథ్ పహాడియా మృతిచెందిన మూడురోజులకే శాంతి పహాడియా సైతం మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. శాంతి పహాడియా రెండుసార్లు ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యురాలిగానూ సేవలందించారు.
ఆమె మృతి పట్ల రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సంతాపం తెలిపారు. ‘‘మాజీ రాజ్యసభ సభ్యురాలు, దివంగత మాజీ సీఎం జగన్నాథ్ పహాడియా సతీమణి శాంతి పహాడియా మరణ వార్త నన్ను విచారణకు గురిచేసింది. పహాడియా దంపతులు ప్రజాసమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషిచేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. పహాడియా కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని సీఎం గెహ్లాట్ ట్వీట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.