గొలుసుకట్టు చెరువులను పూర్తిస్థాయిలో నింపుతాం
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి
చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్కు నీటి విడుదల
మక్తల్ రూరల్, జూన్ 10 : వానకాలం పంటలకు స మృద్ధిగా సాగునీరు అందిస్తామని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మక్తల్ మండలంలోని సంగంబండ పెద్దవాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు గురువారం ఖానాపూర్ గ్రామశివారులోని భీమా ఫేజ్-2 పంపుహౌస్ నుంచి నీటి పంపింగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ఈ ఏడాది వానకాలం ప్రారంభంలోనే రిజర్వాయర్లకు నీటి పంపింగ్ ప్రారంభమైందన్నారు. చిట్టెం నర్సిరె డ్డి, భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల పరిధిలోని గొలుసుకట్టు చెరువులను పూర్తిస్థాయిలో నింపుతామన్నా రు.
ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టు భూములకు కూడా సాగునీరు అందించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రైతులు కాల్వల కింద తమ పంట పొలాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం త్వరలోనే రైతుబంధు పథకంతో పెట్టుబడి సాయం రైతుల ఖాతా ల్లో జమ చేస్తుందని తెలిపారు. అనంతరం ప్రాజెక్టు ఇంజినీరు శివ ధర్మతేజ మాట్లాడుతూ ప్రస్తుతం ఒక మోటరును ప్రారంభించామని, వారంరోజుల్లో మిగతా రెండు మోటర్లను ప్రారంభించి నీటిని విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం చిన్నగోప్లాపూర్ వద్ద భీమా లిఫ్ట్-1 నుంచి ఒక మోటరు రన్ అవుతుందని, దీనివల్ల ప్రస్తుతం రోజుకు 1500 క్యూసెక్యుల నీరు చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు వస్తుందన్నారు. 15రోజుల్లో రిజర్వాయర్కు పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. కార్యక్రమంలో ఏఈ నాగశివ, ఎంపీపీ వనజ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్గుప్తా, టీఆర్ఎస్ మండలం అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, మాగనూర్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, పస్పుల సర్పం చ్ దత్తప్ప, అధికార ప్రతినిధి రాంలింగం, మీడియా కన్వీనర్ నేతాజీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.