హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ/ ప్రభుత్వ దవాఖానలో నియామకాలకు వైద్యవిద్య విభాగం గురువారం నోటిఫికేషన్ విడుదలచేసింది. 53 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో, 14 గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్టు తెలిపింది. 31న మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్ కలెక్టరేట్లో ఇంటర్వ్యూలు ఉంటాయి.