‘చిత్రనిర్మాణ బాధ్యతల్ని చేపట్టిన హీరోలు చాలామంది ఉన్నారు. కానీ కథానాయికలు నిర్మాతగా మారడం అరుదు. ‘బాయ్స్’ సినిమాలో మిత్రాశర్మ హీరోయిన్గా నటిస్తూ తానే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం సాహసమనే చెప్పాలి’ అని అన్నారు హీరో కార్తికేయ. ‘బాయ్స్’ ఫస్ట్లుక్ పోస్టర్ను బుధవారం హైదరాబాద్లో కార్తికేయ ఆవిష్కరించారు. మిత్రాశర్మ కథానాయికగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రమిది. దయానంద్ దర్శకుడు. గీతానంద్ హీరో. ఈ సందర్భంగా మిత్రాశర్మ మాట్లాడుతూ ‘కథ నచ్చి నేను నిర్మిస్తున్న చిత్రమిది. లక్ష్యసాధనలో కొందరు యువతీయువకుల బృందానికి ఎదురైన ఆటంకాలేమిటన్నది అలరిస్తుంది. సింగిల్ షెడ్యూల్ సినిమాను పూర్తిచేస్తాం’ అని చెప్పింది. ‘ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందిన ‘బాయ్స్’ టైటిల్తో వస్తోన్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి. నిర్మాతగా, హీరోయిన్గా మిత్రాశర్మకు మంచి పేరు రావాలి’ అని హీరో కార్తికేయ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళామందిర్ కల్యాణ్, సుచిర్ ఇండియాకిరణ్ పాల్గొన్నారు.