సందర్శించిన పరకాల ఎమ్మెల్యే
గజ్వేల్ అర్బన్, మే 19: గజ్వేల్ పట్టణంలోని సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ను పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బుధవారం సందర్శించారు. ఆర్డీవో విజయేందర్రెడ్డి, ఏఎంసీ కార్యదర్శి జాన్వెస్లీలు మార్కెట్ నిర్మాణం, నిర్వహణ గురించి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్లో అద్భుతమైన అభివృద్ధి జరిగిందన్నారు. సమీకృత మార్కెట్ నిర్మాణం, వ్యాపారులకు అందిస్తున్న వసతులు చాలా బాగున్నాయన్నారు.