సూరత్: కరోనాను జయించిన వాళ్లను వణికిస్తున్న బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకోర్మికోసిస్ గుజరాత్కూ పాకింది. ఆ రాష్ట్రంలోని సూరత్లోనే గత 15 రోజుల్లో 40 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. వీళ్లలో 8 మంది చూపు కోల్పోగా వాళ్లను వెంటనే హాస్పిటల్స్లో అడ్మిట్ చేశారు. ఈ బ్లాక్ ఫంగస్ను చికిత్స ద్వారా నయం చేయవచ్చు. కానీ ఆలస్యం చేస్తే మాత్రం చూపు కోల్పోవడం, కొన్నిసార్లు ప్రాణాలే పోయే ప్రమాదం కూడా ఉన్నదని డాక్టర్లు చెబుతున్నారు.
ఈ బ్లాక్ ఫంగస్ ఎలా వస్తుంది?
అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం.. ఈ బ్లాక్ ఫంగస్ ఒక అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్. అయితే ఇది చాలా ప్రమాదకరం. మ్యూకోర్మిసెటెస్ అనే ఫంగి ద్వారా ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఫంగి మన వాతావరణంలోనే ఉంటుంది. ఇది సైనస్ లేదా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. చర్మం తెగినా, కాలినా, ఇతర చర్మ సంబంధిత గాయాల్లోనూ ఈ ఫంగి కనిపిస్తుంది.
బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఏంటి?
సాధారణంగా కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత రెండు, మూడు రోజుల్లోనే ఈ బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తాయి. ఇది మొదట సైనస్లో కనిపిస్తుందని, ఆ తర్వాత మెల్లగా కళ్లలోకి చొరబడుతుందని సూరత్లోని ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ సంకేత్ షా వెల్లడించారు. ఆ తర్వాతి 24 గంటల్లో మెదడు వరకూ కూడా ఇది వెళ్లవచ్చని చెప్పారు. ఒకవైపు ముఖంలో వాపు కనిపించడం, తలనొప్పి, ముక్కుదిబ్బడ, జ్వరం, నోటిపై భాగంలో నల్లటి గాయాల మాదిరిగా కనిపిస్తాయి. అవి చాలా త్వరగా తీవ్రమవుతాయి.
ఎవరికి ఎక్కువ ప్రమాదం?
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఇది దాడి చేస్తుందని డాక్టర్ సంకేత్ షా చెప్పారు. డయాబెటిస్ పేషెంట్లు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లు, క్రిములు, అనారోగ్యంతో పోరాడే సామర్థ్యాన్ని దెబ్బతీసే మందులు వాడే వాళ్లు దీని బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ మధ్య కొవిడ్ నుంచి కోలుకున్న వాళ్లలో తరచూ కనిపిస్తోందని మరో ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ అజయ్ స్వరూప్ చెప్పారు.
ఇది కూడా చదవండి
ఇలా చేస్తే కరోనా థర్డ్ వేవ్ రాదు: విజయ్రాఘవన్
గాల్లో కరోనా వైరస్ ఎంత దూరం ప్రయాణిస్తుందో తెలుసా?
పసుపు పాలు, డార్క్ చాక్లెట్.. కొవిడ్ పేషెంట్లు ఏం తినాలో చెప్పిన ప్రభుత్వం
కొవిడ్తో బ్లాక్ ఫంగస్.. ఏంటిది? ఎంత ప్రమాదం?