హైదరాబాద్ : మఏ 27, 28 తేదీల్లో నగరంలోని మియాపూర్, దాని పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేయబడుతుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సివరేజీ బోర్డు ప్రకారం మియాపూర్లో నూతన మురుగునీటి కాలువ నిర్మాణం కారణంగా నీటి పైప్లైన్లను తిరిగి వేస్తుండటంతో ఇక్కడ నీటి సరఫరా నిలిపివేయబడుతోందని అధికారులు చెప్పారు. గంగారం, దీప్తీశ్రీ నగర్, కేఎస్ఆర్ ఎన్క్లేవ్, అపర్ణ హిల్స్, ఆదర్శ్ నగర్, శాంతి నగర్, మియాపూర్, మైత్రి నగర్, మదీనాగూడ, ఇతర ప్రాంతాలు నీటి సరఫరా నిలిపివేయనున్నారు. ఈ అసౌకర్యాన్ని నివారించేందుకు వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిందిగా వాటర్ బోర్డు కోరింది.