ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ తన అప్పులు చెల్లించడానికి ఆస్తులను తెగనమ్మేస్తున్నారు. తాజాగా, ముంబైలోని ‘రిలయన్స్ సెంటర్’ ప్రధాన కార్యాలయాన్ని రూ. 1,200 కోట్లకు విక్రయించారు. అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఈ వేలం చేపట్టింది.
అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీని బయటపడేసేందుకు వేల కోట్ల విలువ చేసే తన ఆస్తిని అనిల్ అంబానీ అమ్మేశారు. ఈ ఏడాది జనవరిలో కూడా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు ఆస్తులను విక్రయించింది. దీన్ని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యెస్ బ్యాంక్ టేకోవర్ చేసింది.
రిలయన్స్ ప్రధాన కార్యాలయాన్ని తన కార్పొరేట్ ప్రధాన కార్యాలయంగా వినియోగించనున్నట్టు యెస్ బ్యాంకు పేర్కొంది. బ్యాంకుకు చెల్లించాల్సిన అప్పును తీర్చడానికే ఈ ఆస్తిని అమ్మినట్టు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇంతకుముందు ఢిల్లీ ఆగ్రా టోల్ రోడ్ను రూ.3,600 కోట్లకు, పర్బతి కోల్డామ్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ను రూ.900 కోట్లకు అనిల్ అంబానీ విక్రయించిన సంగతి తెలిసిందే.
రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా యెస్ బ్యాంకుకు రూ. 2000 కోట్ల వరకు బకాయి ఉంది. కాగా… అప్పులను తీర్చిన ప్రకటన వచ్చిన తర్వాత కంపెనీ షేర్ ధర ఒక్కసారిగా దూసుకెళ్లింది. పది శాతం వరకు ర్యాలీ చేసిన తర్వాత మిడ్-సెషన్ సమయంలో 7.98 శాతంతో ఇంట్రాడే గరిష్ఠ స్థాయి వద్ద ట్రేడయింది.
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం
ఫ్యూచర్కు లైఫ్లైన్.. డీల్ అమలుకు రిలయన్స్ 6 నెలల టైం!