విజయవాడ : తెలంగాణ స్థానికత కలిగిఉండి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న రాష్ట్ర ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. తెలంగాణ స్థానికత కలిగి తెలంగాణ కోరుకున్న ఉద్యోగుల రిలీవ్కు సీఎం వైఎస్ జగన్ అంగీకారం తెలిపారు. దీంతో క్లాస్-3, క్లాస్-4కు చెందిన 711 మంది ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ సీఎస్ ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణకు వస్తున్న ఉద్యోగులకు సీఎం జగన్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.