యాదాద్రి/బాసర: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహా స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఆలయ పునర్నిర్మాణ పనులను న్యాయమూర్తి పరిశీలించారు. నిర్మాణాలు భేష్గా ఉన్నాయని చెప్పారు. ఆర్కిటెక్ పనులు అద్భుతమైన రీతిలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపై తరచూ స్వామివారిని దర్శించుకుంటానని తెలిపారు.
జ్ఞాన సరస్వతి సేవలో జస్టిస్ శ్రీదేవి
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీదేవి దర్శించుకున్నారు. శనివారం వేకువజామున అమ్మవారి అభిషేక సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు ఆమెకు అమ్మవారి ప్రతిమను అందజేశారు.