హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలని వైద్యారోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లుగా పలు ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాస్రావు అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అటువంటి ప్రతిపాదనలేవీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో కొవిడ్ కేసుల పెరుగుదలలో స్థిరత్వం వచ్చినట్లు తెలిపారు. ప్రజలు ఇలాగే జాగ్రత్తలు పాటిస్తే మరో 3 నుండి 4 వారాల్లో వైరస్ అదుపులోకి వస్తుందన్నారు. కాబట్టి లాక్డౌన్ పెట్టాలనే ఆలోచన కానీ, ప్రతిపాదనలు కానీ తామేమీ ఇవ్వలేదని.. కనీసం అటువంటి ఉద్దేశం కూడా వైద్య ఆరోగ్యశాఖకు లేదని పేర్కొన్నారు.