హైదరాబాద్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని, ఏ ఎన్నిక వచ్చినా కారు జోరు కొనసాగుతుందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ప్రజలు టీఆర్ఎస్ వెన్నంటి నిలిచి ఎమ్మెల్యేగా నోముల భగత్కు పట్టం కట్టారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్కు కృతజ్ఞతలు, కేటీఆర్కు, ఎమ్మెల్యేగా ఎన్నికైన నోముల భగత్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. విజయాన్ని అందించిన ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
బైక్ను ఢీకొట్టిన లారీ..ఆర్ఎస్ఐ మృతి
రంజాన్ కిట్లను పంపిణీ చేసిన మంత్రి అల్లోల
సీనియర్ ఫొటోగ్రాఫర్ సలీం మృతి పట్ల మంత్రి వేముల సంతాపం