హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలిలో టీహబ్ నిర్మాణపనులను ఐటీ, పరిశ్రమశాఖలశాఖ మంత్రి కే తారకరామారావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు, ఇంజినీర్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్లలో ఒకటైన టీహబ్ను సందర్శించినట్టు ఆయన ట్విట్టర్లో తెలిపారు. ఈ నిర్మాణం పూర్తయితే ఆవిష్కరణల రంగంలో హైదరాబాద్ మరింత ఎత్తుకు ఎదుగుతుందని పేర్కొన్నారు.