మహబూబ్నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లు
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 17 : శాంతి భద్రతల పరిరక్షణతోపాటు సమాజ శ్రేయస్సుకు పనిచేస్తున్న పోలీసు శాఖ పట్ల అభిమానంతో స హకారం అందించడం తమకు మరింత ఉత్సాహా న్ని ఇస్తుందని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు అన్నా రు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పోలీసు సి బ్బంది కోసం శానిటైజర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత ప్రమాదకర పరిస్థితుల్లో పోలీసు సిబ్బంది ప్రజల మధ్యే ఉం టూ కనిపించని శత్రువుతో పోరాడుతున్నారని, విపత్తు నుంచి సమాజానికి రక్షణ కల్పించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. పోలీసుల కష్టాన్ని గమనించి ఎంపీ అందించిన సహకారంపై ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. అందరం కలిసి కరోనా భూతాన్ని పారద్రోలి ఆనందకరమైన వాతావర ణం నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి కేదార్నాథ్ బంగ్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, అప్పలనాయుడు, ఎస్పీ పీఆర్వో రంగినేని మన్మోహన్ పాల్గొన్నారు.