జైసల్మేర్: రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్ జిల్లాలో ఘోరం జరిగింది. వాటర్ ట్యాంకులో పడి తాతామనవడు ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. జైసల్మేర్ జిల్లా నోఖ్ ఏరియాలోని ఓ ఇంట్లో రావల్ సింగ్ (11) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంకులో పడిపోయాడు. ఇది గమనించిన అతని తాత కూప్ సింగ్ (55) మునిగిపోతున్న మనుమడిని కాపాడేందుకు ట్యాంకులో దూకాడు.
అయితే రావల్ సింగ్ భయంతో తాతను బిగ్గరగా చుట్టుకోవడంతో కూప్సింగ్కు ఈదడం సాధ్యంకాక ఇద్దరూ నీళ్లలో మునిగిపోయారు. స్థానికులు వారిని బయటికి తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.