ఖమ్మం, కొత్తగూడెంలో ఖాళీ కుర్చీలే దిక్కు
ఖమ్మం, మార్చి 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం, భద్రా ద్రి కొత్తగూడెం జిల్లాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనకు స్పందన కరువైంది. సోమవారం కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన బీజేపీ సభకు బండి సంజయ్ హాజరయ్యారు. అంతకుముందు ర్యాలీ కార్యకర్తలు లేకుండానే సాగింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సభకు కార్యకర్తలు నామమాత్రంగానే హాజరుకావడంతో చాలా కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. మధ్యలోనే కార్యకర్తలు ఇంటిముఖం పట్టారు. కాగా రాత్రి ఖమ్మం నగరంలోని ఈఆర్ఆర్ రిసార్ట్స్లో నిర్వహించిన బీజేపీ సభకు కార్యకర్తల స్పందన అంతంత మాత్రంగానే కన్పించింది.