యాదాద్రి, మార్చి29: ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటు పడుతూ, కార్యకర్తలకు అండగా ఉం టున్న కాంగ్రెస్ బీసీ నాయకుడు బీర్ల అయిలయ్యపై కొందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే ఐటీ అధికారులతో దాడు లు చేయించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మా జీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారం టే అర్ధముందని, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై ఐటీ అధికారులకు ఫిర్యాదు చేయడం విడ్డూరం గా ఉందని తెలిపారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణం లో ఆయన బీర్ల అయిలయ్యను పరామర్శించి మాట్లాడుతూ పార్టీలోనే ఉంటూ, స్వంత డబ్బులతో కాంగ్రెస్ పార్టీని కాపా డుతున్న బీర్ల అయిలయ్యపై దాడులు చేయించడం సరికాద ని, వెంటనే అదిష్టానం స్పందించి తగు చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేశారు. స్వంత డబ్బులతోనే భూముల క్రయ విక్రయాలు చేసే తప్పేంటని ప్రశ్నించారు. కావాలని కొంత మంది కాంగ్రెస్ పార్టీ నాయకులే అయిలయ్యపై హైకోర్టులో కేసు వేశారని, అక్కడ నిరాశ ఎదురవ్వడంతో ఆదాయపన్ను శాఖ అధికారులకు పిర్యాదు చేశారని అన్నారు. 48 గంటల పాటు ఐటీ సోదాలు చేయడం సరైది కాదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తమయితే కాంగ్రెస్ పార్టీపై బీసీలలో వ్యతిరేకత రావడం ఖాయమన్నారు. బీర్ల అయిలయ్యకు న్యాయం జరిగేవరకు ఆయనకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలునాయక్, ఎంపీపీ చీర శ్రీశైలం, టీఆర్ఎస్ గుండ్లపల్లి భరత్, కానుగు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.