నిర్మల్ : పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో ఉంచడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం పని చేస్తుందని అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణ ప్రగతిలో భాగంగా శివాజీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రూ. 5.50 కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్డు వెడల్పు, సుందరీకరణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. సీఎం కేసీఆర్ గ్రామ, పట్టణ ప్రాంతాలకు నెలనెల నిధులు మంజూరు చేస్తున్నారని వెల్లడించారు. నిర్మల్ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. పట్టణ ప్రగతితో ముందుగా పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చుకుందామని చెప్పారు. ఎక్కడ కూడా చెత్త లేకుండా నీటుగా ఉంచుకోవాలని సూచించారు. పారిశుద్యం లోపించకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
బ్లాక్ మార్కెట్లో పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
వరంగల్లో హైటెక్స్ నిర్మాణానికి టీఎస్ఐఐసీ అనుమతులు
రైతువేదికలు ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
మొక్కలు నాటి సంరక్షిద్దాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్