నిర్మల్ : నిర్మల్ జిల్లా అయిన తరువాత అభివృద్ధిలో దూసుకెళ్తుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో రూ.7 కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న సమీకృత మార్కెట్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..జిల్లాను అన్ని హంగులతో సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ క్రమంలో పూలు, కూరగాయలు, మాంసం, తదితర వస్తువులు అన్నీ ఒకే చోట దొరికేలా సమీకృత మార్కెట్ను నిర్మిస్తున్నామని తెలిపారు.దీంతో వ్యాపారులకు, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. త్వరలోనే ఇంటికి రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ముష ర్రఫ్ ఫారుఖీ, అదనపు కలెక్టర్ హేమంత్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కమిషనర్ బాలకృష్ణ, కాంట్రాక్టర్ మురళి, వైస్ చైర్మన్ షేక్ సాజిద్, డీఈ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి ఆలయం అత్యద్భుతం : ఏపీ మంత్రి పేర్ని నాని
విమర్శల పాలవుతున్న ప్రగ్యా ఠాకూర్.. ఎందుకంటే.?
పేదలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం
సానియా మీర్జా, షోయెబ్ జంటకు యూఏఈ గోల్డెన్ వీసా జారీ