షాద్నగర్ రూరల్. సెప్టెంబర్22: రాష్ట్రంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు ఎన్ఐఆర్డీపీఆర్ సభ్యులు సందర్శనకు వచ్చారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలంలోని హజిపల్లి గ్రామాన్ని సందర్శించారు.
గ్రామంలోని వివిధ అభివృద్ధి పనులు చాలా బాగున్నాయని ప్రశంసించారు. అస్సాం, మేఘాలయ, కేరళ, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన వివిధ గ్రామాల బ్లాక్డెవలప్మెంట్ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్ఐఆర్డీపీఆర్ ప్రతినిధులు రవిబాబు, లఖన్సింగ్, ఫరూఖ్నగర్ ఎంపీపీ ఖాజాఇద్రీస్ అహ్మద్తో కలిసి సందర్శించారు. గ్రామంలో వీధి దీపాలు, చెత్త సేకరణ, సీసీ రోడ్లు, నల్లాలు, డంపింగ్యార్డ్, శ్మశాన వాటిక, పల్లెప్రకృతి వనం, ఇంకుడు గుంతలను పరిశీలించారు. పలు వివరాలను సర్పంచ్ మౌనికను అడిగి తెలుసుకున్నారు.